పుట్టినరోజున పేద విద్యార్థులకు చేయూత

పుట్టినరోజున పేద విద్యార్థులకు చేయూత

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ రేవూరి వెంకన్న తన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు 5,000 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ అందజేశారు. పుట్టినరోజు వేడుకలను ఎంతో ఆర్భాటంగా నిర్వహించుకుంటున్న ప్రస్తుత రోజుల్లో వెంకన్న నిరాడంబరంగా పేద విద్యార్థులకు చేయూతనందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.