మార్కెట్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

మార్కెట్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

కేసముద్రం ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మార్కెట్లో షెడ్లలో ఎక్కడికక్కడే రైతులకు వేసవిలో శుద్ధిచేసిన చల్లని తాగునీరు అందించడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే మార్కెట్లో వివిధ రకాల సౌకర్యాలు కల్పించామని తాజాగా ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో రైతులకు దాదాపు అన్ని రకాల ఇబ్బందులు తొలగించినట్లు చైర్పర్సన్ వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శి రాజా, పాలకమండలి సభ్యులు హరీష్ నాయక్, భద్రాద్రి తదితరులు ఉన్నారు.