మానుకోట లో సురక్షదినోత్సవ వేడుకలు ప్రారంభం..

మానుకోట లో సురక్షదినోత్సవ వేడుకలు ప్రారంభం..

 జెండా ఊపి ప్రారంబించిన మంత్రి సత్యవతిరాథోడ్..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవం వేడుకలను ఆదివారం నిర్వహించింది. ఈ..కార్యక్రమాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. పోలీసుల వాహనల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతిరాథోడ్ తోపాటు మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాపోలీస్ ప్రధానకార్యాలయానికి చేరుకున్న మంత్రి సత్యవతిరాథోడ్ అతిధులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూం పనితీరును పరిశీలించారు..