ఘనంగా సచ్చిదానంద స్వామి జన్మదిన వేడుకలు

ఘనంగా సచ్చిదానంద స్వామి జన్మదిన వేడుకలు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం అవధూత దత్త పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 81వ జన్మదిన వేడుకలను కేసముద్రం దత్త భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికసాయిబాబా మందిరంలో స్వామిజి పేరున అర్చన చేసి అనంతరం గోశాలలో గోవులకు గ్రాసం, ప్రజలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అంబేద్కర్ సెంటర్ లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లేగల విజయభాస్కర్ రెడ్డి, కన్నా వేణు, డాక్టర్ చంద్రశేఖర్ , కొప్పుల శంకర్, వంశీ , శ్రీను , వీరన్న, భాస్కర్ , విజయ్, రాజు, విశ్వేశ్వర్ , దేవేందర్ రెడ్డి, వీరారెడ్డి, సోమేశ్వర్ దత్త బృందం పాల్గొన్నారు.