కార్యకర్తలే పార్టీకి.... పట్టు కొమ్మలు

కార్యకర్తలే పార్టీకి.... పట్టు కొమ్మలు

ముద్ర ప్రతినిధి, మెదక్: బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలనీ వారి కష్ట సుఖాలలో బిఆర్ఎస్ పార్టీ కొండంత అండగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుదవారం మండల కేంద్రమైన పాపన్నపేట మంజీరా గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ అరవై యేండ్ల పాలనలో పాలకులు చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ 9 ఏళ్ళలో చేశారని, రైతు వ్యతరేక చట్టాలను ఎండగట్టి కేంద్ర ప్రభుత్వం  వ్యవసాయ బోరుబావుల వద్ద మీటర్లు బిగించాలని ప్రయత్నం చేస్తే వారి కుట్రలను తిప్పి పంపారని తెలిపారు. రైతులకు నష్టం కల్గించే ఏ పార్టీ బాగుపడదన్నారు. అబ్కిబార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు వెళ్తున్నారని, ప్రజల ఆశీర్వాదం ఎంతో అవసరమన్నారు.  ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి నాలుగోసారి గెలుపు ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురుమూర్తి గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కుబేరుడు, రైతు బందు జిల్లా అధ్యక్షులు సోములు,  ఇఫ్కొ డైరక్టర్ దేవేందర్ రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ గడిల.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సర్పంచులు రాణి కిష్టయ్య, ప్రమీల గోపాల్ రెడ్డి, బుజ్జమ్మ అషయ్య, కవిత రవీందర్, వెంకట్ రాములు, మల్లేశం, స్రవంతి శ్రీనివాస్, కిషన్, సుదర్శన్, లింగారెడ్డి, సంగప్ప, తిరుపతి రెడ్డి, నవీన్, లక్ష్మి దుర్గయ్య, దాసు, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, దానయ్య, అంజయ్య, కో ఆపరేటివ్ చైర్మన్లు మల్లేశం, దత్తురాజ్, మాజీ పాలక మండలి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు దుర్గయ్య, సుభాష్ గౌడ్, ఇమానియల్, బాబాగౌడ్, బాబర్,  వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.