పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి హుస్సేన్ నాయక్! ఎన్నికలకు బిజెపి సమాయత్తం

పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి హుస్సేన్ నాయక్! ఎన్నికలకు బిజెపి సమాయత్తం

కేసముద్రం, ముద్ర: రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ప్రచార పర్వానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. శ్రావణమాసం ప్రారంభం కాగానే ప్రతి పల్లెకు బిజెపి, ఇంటింటికి హుస్సేన్ నాయక్ అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. గురువారం కేసముద్రం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పొదిలి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ మండల స్థాయిలో పార్టీ పటిష్టత, చేరికలు, విస్తృత ప్రచారం, కార్యక్రమాల నిర్వహణ, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసి ఆ మేరకు ప్రజలకు చెరువయ్యేందుకు ప్రత్యేకంగా మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వం పార్టీ పటిష్టత కోసం అనుక్షణం పాటుపడాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీలో యాక్టివ్ కార్యకర్తలను గుర్తించి ప్రచార బాధ్యతలను అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామడుగు వెంకట చారి, బోగోజు నాగేశ్వరా చారి, గాంతి వెంకట్ రెడ్డి, రడం వెంకన్న, మల్యాల రాములు, ఉప్పునూతల రమేష్, నరేష్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.