ఎన్టీఆర్ తోనే రాజకీయ చైతన్యం.. ఘనంగా శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్ తోనే రాజకీయ చైతన్యం.. ఘనంగా శతజయంతి వేడుకలు

కేసముద్రం, ముద్ర: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాజకీయ చైతన్యం వచ్చిందని మహబూబాబాద్ జిల్లా టిడిపి అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు అన్నారు. కేసముద్రంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శిలా విగ్రహానికి టిడిపి నేతలు ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం పేదలకు పాలు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం మండల టిడిపి అధ్యక్షుడు ఏశబోయిన ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్య వచ్చిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మధ్య నిషేధం, రూపాయికి కిలో బియ్యం, మహిళా సాధికారిక పథకాలు, బీసీలకు రాజ్యాధికారం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాని, ఎన్టీఆర్ విగ్రహావిష్కర్త, కేసముద్రం మాజీ సర్పంచ్ సట్ల నరసయ్య,  ఎన్టీఆర్ అభిమానులు చెన్నారెడ్డి, మాచర్ల ప్రసాద్, రడం చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.