పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ గ్రామ పరిధిలోని బ్రహ్మంగారి తండా ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 23 లక్షల రూపాయలతో మన ఊరు- మనబడి పథకంలో ప్రభుత్వం పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రెండు గదులు, వరండా తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టాయిలెట్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్, వార్డు సభ్యురాలు బానోత్ పద్మ బాలు నాయక్, మాజీ ఉపసర్పంచ్ బద్రు నాయక్, పిఆర్ ఏఈ మానస,  ఈవో చుక్కల అశోక్ కుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖాదర్, హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ కోసల జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.