హే అల్లా దువా దే..

హే అల్లా దువా దే..
  • టికెట్ వస్తుందని ఆశాభవంతో ఉన్నా
  • కాంగ్రెస్ నేత మురళి నాయక్ ధీమా

కేసముద్రం, ముద్ర: హే అల్లా దువా దే.. మానుకోట కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మురళి నాయక్ కేసముద్రం అమిరుద్దీన్ బాబా దర్గాలో శుక్రవారం పూజలు నిర్వహించారు. అల్లా దయవల్ల టికెట్ రావాలని ఆశిస్తున్నట్లు మురళి నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన  తాత తండ్రుల నుంచి కాంగ్రెస్ కుటుంబమని, మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్న, పదవులు రాలేదని, పదవులు తొలగించారని, అనుచరులు ఎవరు కూడా ఎలాంటి నిరాశకు లోను కావద్దన్నారు. ఏళ్ల తరబడిగా తన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉందని, ఆ మేరకే తన తండ్రి మంగ్యా నాయక్ జెడ్పిటిసి అయ్యారని, తన సతీమణి ఉమ మున్సిపల్ చైర్మన్ అయ్యారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, అప్పటినుంచి ఇప్పటివరకు మానుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు చెప్పారు. కార్యకర్తల అండ, ప్రజల అభీష్టం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట టికెట్ రేస్ లో ఉన్నానని, టిక్కెటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.