విద్యార్థులను  ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి - అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

విద్యార్థులను  ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి - అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:ఉత్తమ బోధనతో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులతో  ఆదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా గార్లలోని బంజారా సేవాసమితి రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి పరిశీలించారుఈ సందర్భంగా అదనపు కలెక్టర్  అభిలాషఅభినవ్ విద్యార్థుల  బోధనా తరగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభాపాటవాలను పరీక్షించి వారు చేసిన స్కిట్ లను చూసి మెచ్చుకున్నారు. మానసికంగా దృఢంగా ఉండేందుకు చదువుతోపాటు ఆటలు ఆడాలని, విద్యార్థులు ఏమేమి ఆటలు ఆడుతున్నారో అడిగి తెలుసుకుని ఇండోర్ గేమ్స్ కు సంబంధించిన ఆట వస్తువులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సిబ్బందితో అన్నారు.  బాగా చదువుకుని ప్రయోజకులు అయి మంచి ఉద్యోగం సంపాదించెందుకు కష్టపడి చదవాలని అన్నారు. అనంతరం బోజనశాలను తనిఖీ చేసి , మెనూ ప్రకారం అందిస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్ లను పరిశీలించారు.  డార్మిమిటరీ లను పరిశీలించి  టాయిలెట్ లను  శుభ్రంగా ఉంచాలని,  వర్షాకాలం దృష్ట్యా దోమతెరలను పెట్టించాలని, అవసమైన వెలుతురు ఉండేలా చూడాలని, స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి వంట సామాను పెట్టేందుకు ర్యాకులను ఏర్పాటు చేయాలని 130 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో హాజరు రిజిష్టరును పరిశీలించారు. డిజిటల్ తరగతులను పరిశీలించి ఆన్లైన్ సిలబస్ అందుబాటులో ఉందా లేదా అని  అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాలును, విద్యార్థులు ఆడే ఆట స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం సీతంపేట గ్రామపంచాయతీ లోని నర్సరీని సందర్శించి నిర్వహణను పరిశీలించారు.  అవసరం మేరకు మొక్కలు నాటేందుకు పూల, పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవెన్యూ ప్లానిటేషన్ కు మొక్కలను సిద్ధం చేయాలని అన్నారు. నర్సరీ లో ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయో రిజిస్టర్ తనిఖీ చేసి చూశారు. నర్సరీ యొక్క నిర్వాహణ పనితీరు బాగుందని ఈ సందర్భంగా అధికారులను  అభినందించారు.ఈ సందర్శనలో ఎంపిడిఓ రవీందర్ రావు, ఎంపిఓ రజినీ, ఎపిఓ సజన్,ఇంచార్జి తహసీల్దార్ వీరన్న, బంజారా సేవాసమితి పాఠశాల ప్రిన్సిపాల్ సేనా, అకడమిక్ ఇంచార్జి రమేష్,ఉపాధ్యాయులు, వనసేవకుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు