అన్ని మతాలకు అండగా బిఆర్ఎస్

అన్ని మతాలకు అండగా బిఆర్ఎస్

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ -ప్రతాప్ రెడ్డి

తూప్రాన్ ముద్ర : అన్ని మతాలకు బిఆర్ఎస్ అండగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందులో అయన పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని అన్నారు. రంజాన్ పవిత్రతకు మారు పేరు అని అన్నారు ఈ విందులో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పురం మహేష్, ఆయా గ్రామాల సర్పంచ్ లు నర్సయ్య, ఉప సర్పంచ్ లు రేణుకుమార్, దర్మేందర్, నాయకులు రవి, రమేష్, రాహుల్ రెడ్డి, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు.