నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న కేంద్రం

నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న కేంద్రం

కేసముద్రం, ముద్ర: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిలువునా ముంచుతోందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకుడు శివారపు శ్రీధర్ ఆరోపించారు.

ఈనెల 5, 6 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించే పివైఎల్ రెండవ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను కేసముద్రం మండల కేంద్రంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఏటా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు బిజెపి కేంద్ర సర్కార్ హామీ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై సంగటిత పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 5, 6న ఖమ్మంలో నిర్వహించే పి వై ఎల్ రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో యువకులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అనిల్, రాజు, బాలు, బాబు, కృష్ణ, యాకన్న, మాన్ సింగ్ పాల్గొన్నారు.