విద్యార్థిగా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్!

విద్యార్థిగా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్!

కేసముద్రం, ముద్ర: మన ఊరు మనబడి కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విద్యార్థిగా మారి డిజిటల్ విద్యాబోధన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో బ్లాక్ బోర్డు కూడా సక్కగ ఉండేది కాదని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు దీటుగా మారాయని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని కోరారు.