గడపగడపకు బిజెపి

గడపగడపకు బిజెపి

కేసముద్రం, ముద్ర: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లుగా దేశంలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 30 వరకు గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచకొండ కొమరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పొదిల నరసింహ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచకొండ కొమురయ్య హాజరై మాట్లాడుతూ జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల పాటు ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో గడపగడపకు తీసుకెళ్లి వివరించాలని బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, జోనల్ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేలా కృషి చేసి మహబూబాబాద్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లబు వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి గాంతి వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమ్మాల వెంకటరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు వెంకటాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు రడం వెంకన్న, జమ్ముల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.