మహబూబాబాద్ పార్లమెంట్ కు బోణీ...!! 

మహబూబాబాద్ పార్లమెంట్ కు బోణీ...!! 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి గురువారం నామినేషన్ బోణీ అయ్యింది..  మహబూబాబాద్  జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి  అద్వైత్ కుమార్ సింగ్ కు  స్వతంత్ర అభ్యర్థిగా మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామం గుర్రపుతండాకు చెందిన బాణోత్  లింగ్యానాయక్ నామినేషన్  అందజేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, ఎండేవిడ్ ఆర్డీఓ లు అలివేలు, నరసింహారావు తహసీల్దార్లు భగవాన్ రెడ్డి,దామోదర్, శ్వేత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.