గ్రేడ్ 3 కార్యదర్శి రాజాకు పదోన్నతి

గ్రేడ్ 3 కార్యదర్శి రాజాకు పదోన్నతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.రాజాకు గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి లభించింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజాకు గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ జమ్మికుంట మార్కెట్ కు బదిలీ చేశారు. సూర్యాపేట మార్కెట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన రాజా కేసముద్రం మార్కెట్ కు గ్రేడ్-3 కార్యదర్శిగా పదోన్నతిపై రాగా 24 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహించగా, పదోన్నతి పొంది జమ్మికుంటకు బదిలీ కావడం విశేషం. పదోన్నతి పొందిన గ్రేడ్ -3 కార్యదర్శికి వ్యాపారులు, సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.