పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు తీవ్ర అస్వస్థత...

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు తీవ్ర అస్వస్థత...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. ఎఫ్‌.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు లోనయ్యారు. ప్రచారం మధ్యలోనే ఆపేసి ఆఫీసుకు వెళ్లిపోయిన గీతాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో వంగా గీత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్‌, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు. 48 గంటలు రెస్ట్ అవసరమని గీతకు వైద్యుల సూచన చేశారు.