YS Jagan Attack Case :- సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం

YS Jagan Attack Case :- సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం

ముద్ర,ఆంధ్రప్రదేశ్- సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సతీష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో సతీష్ ను పోలీసులు హాజరుపర్చారు. కాగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ పై జరిగిన దాడిలో సతీష్ ఏ1 గా ఉన్నాడు. ఇదే సతీష్ కు సహకరించిన దుర్గారావు సహా మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.