బాంబు పేల్చిన ఉండవల్లి..

బాంబు పేల్చిన ఉండవల్లి..
  • చంద్రబాబు కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలవుతారని అభిమానులు భావిస్తుండగా.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో బాంబ్ పేల్చారు. చంద్రబాబు నాయుడిపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కేసులో ఉన్న సంక్లిష్టత, హై ప్రొఫైల్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిఉన్న దృష్ట్యా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి తన పిటిషన్‌లో కోరారు. మొత్తం 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు.

చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుతో పాటు సీబీఐ, ఈడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ వైపు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై చర్చ జరుగుతుండగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులను ఉత్కంఠకు గురిచేస్తోంది.