జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన   జిల్లా కలెక్టర్ శశాంక

జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన   జిల్లా కలెక్టర్ శశాంక

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: ఈ సంవత్సరం శోభ కృత్ నామ సంవత్సరం అని  జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక.అందరూ ఆనందంగా శోభించాలనేదే తన ఉద్దేశ్యం అని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధల కు ప్రతీక అని అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయురారోగ్యాలతో జీవించాలని మరోకసారి కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ  నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.