ధనసరి సొసైటీ బ్యాంకులో చోరీ

ధనసరి సొసైటీ బ్యాంకులో చోరీ
Dhansari society bank robbery

క్యాష్ కౌంటర్ నుంచి 1.20 లక్షల చోరీ

(ముద్ర ప్రతినిధి- కేసముద్రం): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధనసరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాష్ కౌంటర్ లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం క్యాష్ కౌంటర్ తెరవడానికి వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాష్ కౌంటర్ వాణిజ్య బ్యాంకు వలె కార్యకలాపాలను సాగిస్తోంది. ఘటనస్థలిని కేసముద్రం ఎస్సై రమేష్ బాబు, క్లూస్ టీమ్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

ఎస్సై రమేష్ బాబు కథనం ప్రకారం ..రోజువారి కార్యకలాపాలు ముగించిన తర్వాత బుధవారం రాత్రి 8 గంటలకు సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కార్యాలయం వెనుక తలుపు గడియ పగలగొట్టి లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లో ఉన్న 1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. క్యాష్ కౌంటర్ లో ఏర్పాటుచేసిన సిసి కెమెరాలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి వివరాలు నమోదు అయినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.