గురుకుల విద్యాలయంలో భవనంపై నుంచి దూకిన విద్యార్థిని తప్పిన ప్రాణాపాయం

గురుకుల విద్యాలయంలో భవనంపై నుంచి దూకిన విద్యార్థిని తప్పిన ప్రాణాపాయం

 కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో సోమవారం మధ్యాహ్నం ఇంటర్ సెకండియర్ చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని భవనం మొదటి అంతస్తు నుంచి కిందకి దూకింది. భోజన విరామ సమయంలో విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి దూకగా కాలి మడమ వద్ద ప్యాక్చర్ అయింది. విద్యార్థి దూకిన ప్రదేశంలో కింద డయాస్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది.

కిందపడ్డ ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి కాలికి చికిత్స చేయించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి ఉన్నతాధికారులకు ప్రమాద ఘటనపై నివేదిక ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలలిత తెలిపారు. విద్యార్థిని కావాలనే భవనం పైనుంచి దూకినట్లు చెబుతుండగా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత దూకడానికి గల కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు.