సెక్యూరిటీ పనులు పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
![సెక్యూరిటీ పనులు పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b54dc318098.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా పర్యటన, నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పోలీసు అధికారులతో కలిసి ముందస్తుగా సెక్యూరిటీ ఏర్పాట్లు పరిశీలించారు. హెలిపాడ్, నూతన కలక్టర్ కార్యాలయ భవనం, ఎస్పీ కార్యాలయ భవనం, వైద్య కళాశాల, మార్కెట్ యార్డ్, సంభా ప్రాంగణం మొదలగు వాటి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు పరిశీలించారు.
అంతరం రోడ్డు మార్గం ను పరిశీలించారు. సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక ప్రకారం భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోపాలకు అవకాశం ఇవ్వొద్దు అన్నారు. జిల్లా యంత్రాంగం, ఇతర ఆన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎస్పీ వెంట DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, DCRB DSP రవి, స్పెషల్ బ్రాంచ్ DSP శ్రీనివాస్, CI లు, SI లు సిబ్బంది ఉన్నారు.