విద్యార్థులకు అల్పాహారం కోసం రూ.10 వేలు విరాళం అందించిన ఎన్నారై దంపతులు

విద్యార్థులకు అల్పాహారం కోసం రూ.10 వేలు విరాళం అందించిన ఎన్నారై దంపతులు
NRI couple donated Rs.10 thousand for breakfast for students

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మాధవపురం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్న సందర్భంగా వారికి అల్పాహారం అందించడం కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్నారై దంపతులు సంకా సిద్ధాంత్-నవ్యలు గురువారం  పదివేల రూపాయలను విరాళంగా ప్రకటించి.. పాఠశాల ఉపాధ్యాయులకు  అందజేశారు.

పిఆర్ టియు(టిఎస్) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రి నారాయణ కుమారుడైన సిద్ధాంత్ ప్రభుత్వపాఠశాల విద్యార్థుల కోసం అందించిన ఈ సహాయాన్ని పలువురు అభినందించారు. చదువుద్వారా విజయాలు సాదించిన ప్రతిఒక్కరు విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని ఉపాద్యాయులు కోరారు.