ప్రేమ విఫలమై దేహం మొక్కలై!

ప్రేమ విఫలమై దేహం మొక్కలై!

ప్రేమించిన యువతితో పెళ్లి కాలేదని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

కేసముద్రం, ముద్ర: ప్రేమించిన యువతితో పెళ్లి కాకుండా పోయిందని మనస్థాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దేహం ముక్కలు ముక్కలుగా మారిపోగా కేవలం తల మాత్రమే మిగిలిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన జల్లె ప్రేమ్ సాగర్ (22) హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు యాకయ్య, ఉమ అక్క పెళ్లి తర్వాత నీ పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఇంతలోనే ప్రేమ్ సాగర్ ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్థాపానికి గురైన ప్రేమ్ సాగర్ సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చి సమీప ఇంటికన్నె రైల్వే స్టేషన్ కు చేరుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ప్రేమ్ సాగర్ దేహం పూర్తిగా తునా తునకలై చెల్లాచెదురుగా పడిపోగా కేవలం తల మాత్రమే రైలు పట్టాలపై పడి ఉండగా చూసిన కొందరు ప్రేమ్ సాగర్ దిగా గుర్తించి సమాచారం ఇచ్చారు. ఎదిగిన కొడుకు రైలు కింద పడి దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.