పేద కుటుంబానికి పదివేల రూపాయలను అందించిన యువకులు

పేద కుటుంబానికి పదివేల రూపాయలను అందించిన యువకులు

కేసముద్రం, ముద్ర: నిరుపేద ఇంటి పెద్ద అకాల మృత్యువాత పడగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి కొందరు యువకులు పదివేల రూపాయలను ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కొమ్ము యాకయ్య ఈనెల 16న మృతి చెందాడు. యాకయ్య  కుటుంబ పరిస్థితిని చూసి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు తలా కొంత చమ్మ కూర్చి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బిసి కాలనీ యువకుల ఔదార్యాన్ని చూసి ప్రతి ఒక్కరు అభినందించారు.