మహబూబాబాద్ లో ఏసిబికి పట్టుబడ్డ పిఆర్ ఏఈఈ
ముద్రప్రతినిధి, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా పంచాయతీ రాజ్ విభాగం కార్యాలయంలో ఏఈఈ లలిత లంచంతీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం కు చెందిన కర్ర అశోక్ రెడ్డి అదే గ్రామంలో రూ.12 లక్షల అరవై వేల రూపాయల అంచనవ్యయంతో వైకుంఠదామాన్ని నిర్మించారు.రూ. 9.50లక్షల బిల్లు రాగా, ఇంకా రూ.3.51లక్షల బిల్లు రావాల్సి ఉంది. బిల్లు చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ లో పని చేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దొడ్డ లలిత పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పింది. బిల్లు చేయడంకోసం రూ.6 వేలు లంచం అడిగినట్లు కర్ర అశోక్ రెడ్డి ఏసీబీ అధికారులకు గత నెల 3 వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఈఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆద్వర్యంలో మంగళవారం కార్యాలయంలో రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా లలితను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.