భూమి కోసం ,భుక్తి కోసం పోరాటం చేసిన యోధుడు దొడ్డి కొమురయ్య. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

భూమి కోసం ,భుక్తి కోసం పోరాటం చేసిన యోధుడు దొడ్డి కొమురయ్య. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర:- తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాటం చేసిన యోధుడు దొడ్డి కొమురయ్య అని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.మంగళవారం పట్టణంలోని దొడ్డి కొమురయ్య విగ్రహం వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన త్యాగానికి ప్రతిరూపమే ఈ తెలంగాణ రాష్ట్రం అన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలు తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరుతున్నాయని తెలిపారు. ఎంపీపీ మారు సాయి రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, కోట రమేష్, గడ్డం మల్లేష్,కోరే రవి, కాచర్ల అంజయ్య, నడిపి సాయన్న, కోట మహేష్, రాజేందర్, చందు, మదు, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.