మంత్రిని కలిసిన జడ్పీ చైర్మన్

మంత్రిని కలిసిన జడ్పీ చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి బుధవారం మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 

జిల్లా పరిషత్ చైర్మన్ గా 4 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రిని కలిసి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దీపిక యుగేందర్ రావు ఉన్నారు.