సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ స్వర్ణమయం

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ స్వర్ణమయం

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ తోనే ఇప్పుడు తెలంగాణ స్వర్ణమయమైందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, ఇనుగుర్తి మండలంలోని మీట్య తండాలో 219.00 లక్షల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి మీట్య తండా వరకు బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, నల్లగుట్ట తండా గ్రామంలో 100.00 లక్షల రూపాయలతో నల్లగుట్ట తండా నుండి దుర్గమ్మ దేవాలయం వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబాటుకు గురైందని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. సీఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్నమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తూ రాష్ట్రాన్ని అగ్ర పదంలో నిలిపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాధవి, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,  వెంకటేశ్వర రెడ్డి, పరిపాటి వెంకట్ రెడ్డి, విజయ్ యాదవ్, వెంకటేష్, రమేష్, సర్పంచ్ లు, ఎంపిటిసీలు, భారాస నాయకులు పాల్గొన్నారు.