ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ మృతి

ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ మృతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా పూర్వపు నెల్లికుదురు, ప్రస్తుత ఇనుగుర్తి మండలం చిన్ననాగారం ఎంపీటీసీ సభ్యుడు గుగులోత్ లక్ష్మణ్ నాయక్ (46) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో వరంగల్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లు లక్ష్మన్ నాయక్ కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మణ్ నాయక్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ నాయక్ మరణ వార్త తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చిన్ననాగారం వచ్చి లక్ష్మణ్ నాయక్ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, భరాసా నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ యాదవ్, యాదగిరిరెడ్డి, భీముడు, రవి నాయక్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ మృతితో చిన్ననాగారంలో విషాదం నెలకొంది.