మహా రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

మహా రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ శాసనసభ్యుడు బాణోత్ శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించే మహా రక్త దాన కార్యక్రమానికి విజయవంతం చేయాలని బారాస మహబూబాబాద్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ చిర్ర యకాంతం గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సరైన సమయానికి రక్తం అందక ఎంతోమంది మృతి చెందుతున్నారని, ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం యువకులు తమ రక్తానికి దానం చేయాలని కోరారు.

తల సేమియా వ్యాధి బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు రక్తదానం చేసి వారి ప్రాణాలను నిలపాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేసి వందల యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ పటేల్, యూత్ నాయకులు శతకోటి నరేష్ యాదవ్, కేసముధ్రం సోషల్ మీడియా కన్వీనర్ తరుణ్ నాయక్ పాల్గొన్నారు.