భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల అరెస్టు..

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల అరెస్టు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు శుక్రవారం ఆందోళన చేస్తున్న బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రతి జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా  హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్న పోలీసులు అడ్డుకుని బిజెపి నేతలను అరెస్టు చేయడం జరిగింది. ఆందోళన కార్యక్రమం చేపట్టిన వారిలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, రేగొండ సర్పంచ్ ఏడునూతుల నిషీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి, ఓబిసి మోర్ఛ జిల్లా అధ్యక్షులు దొంగలు రాజేందర్, అర్బన్ అధ్యక్షులు సామల మాధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు గీసా సంపత్, గణపురం మండల అధ్యక్షులు సాంబయ్య, జిల్లా నాయకులు మాచనవేని రవీందర్, ఉనుకోండ రామకృష్ణ,  మునెందర్, నాంపల్లి కూమార్, మందల రఘునాథ్ రెడ్డి, గాలిప్, దాసరపు రమేష్, సందీప్, నరేష్ శివరామ్ లు ఉన్నారు.