మొక్కలు విరివిగా పెంచాలి - సిఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్

మొక్కలు విరివిగా పెంచాలి - సిఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్

తూప్రాన్, ముద్ర: మొక్కలను విరివిగా పెంచాలని సిఎంఒ ఓఎస్డి ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, దాతర్ పల్లి, మల్కాపూర్ గ్రామాలలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాలలోని పల్లె ప్రకృతి వనాలను పరిశీంచి పలు సూచనలు చేశారు. అనంతరం మొక్కలు నాటారు. వర్షాకాలం కావడంతో మొక్కల పెంపకం వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.  అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా ఫారెస్ట్ అధికారి రవి ప్రసాద్, ఎంపీడీఓ అరుంధతి, సర్పంచ్ లు శ్రీలత రాజిరెడ్డి, నర్సమ్మ, మన్నే మహాదేవినవీన్, సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యదర్శులున్నారు.