BRS Praja Ashirvada Sabha - నేడే అందోల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ...

BRS Praja Ashirvada Sabha - నేడే అందోల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ...

ముద్ర,తెలంగాణ:- పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ జరగనుంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్‌ రావు, మెదక్, జహీరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పఠాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్‌, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోల్, నారాయణ్ ఖెడ్ అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నారు.