గజ్వేల్ లో  ప్రశాంత వాతావరణము

గజ్వేల్ లో  ప్రశాంత వాతావరణము
  • 11 మంది అరెస్ట్, 14 రోజుల రిమాండ్

  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కేసులు చేస్తా

  • సిద్దిపేట సిపి శ్వేత

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రశాంత వాతావరణము నెలకొందని పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు.ఇకముందు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునేకుండా ఉండేందుకు ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గజ్వెల్ లో బుధవారం నాడు సిపి మీడియా సమావేశంలో మాట్లాడారు.రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో ఇప్పటికి వరకు 11 మంది అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్  ముందు హాజరు పరిచి నట్లు తెలిపారు.వారికి  మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని శ్వేత తెలిపారు.

మంగళవారం రోజున ఎలాంటి అనుమతి లేకుండా గజ్వెల్ పట్టణంలోకి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోసియల్ మీడియా లో వచ్చిన అసత్యపు వార్తలను ప్రజలు నమ్మ వద్దన్నారు. సోసియల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.