కంటి వెలుగును సద్వినియోగం చేసుకునేలా చూడాలి

కంటి వెలుగును సద్వినియోగం చేసుకునేలా చూడాలి

కేసముద్రం, ముద్ర: అందత్వ నివారణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకునేలా చూడాలని వైద్య సిబ్బందిని కంటి వెలుగు మహబూబాబాద్ జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ కాలేరు సత్యనారాయణ ఆదేశించారు. కేసముద్రం మండలం అమీనాపురం, వెంకటగిరి గ్రామాల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను మంగళవారం డాక్టర్ సత్యనారాయణ తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరంలో సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి 18 ఏళ్లు పైబడ్డ వారంతా తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చూడాలని ఆదేశించారు.