విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్: సజ్జల
విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మేం చేస్తున్న సంక్షేమాన్ని విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతున్నదా? మా ప్రభుత్వం స్టీల్ప్లాంట్ వయబులిటీ గురించే ఆలోచిస్తోందన్నారు.
స్టీల్ ప్లాంట్ టెండరులో చాలా పరిమితులు ఉన్నాయన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్విషయంలో చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారు. ప్రధాని మోదీతో కూడా చాలాసార్లు మాట్లాడారు. జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ కూడా చెప్పారన్నారు.