ట్రక్కు మీద పడి నలుగురి దుర్మరణం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ట్రక్కు వారి మీద బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పాయారు. నగరంలోని ఆనంద్ ప్రభాత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటన ఉదయం జరగ్గా పోలీసులకు మధ్యాహ్నం ఒకటిన్నరకు సమాచారం అందింది. ట్రక్కను క్రేన్ సహాయంతో పైకి తీశారు. ట్రక్కు మీద పడగానే నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.