ట్రక్కు మీద పడి నలుగురి దుర్మరణం

ట్రక్కు మీద పడి నలుగురి దుర్మరణం

ఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఒక నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​కు చెందిన ట్రక్కు వారి మీద బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పాయారు. నగరంలోని ఆనంద్​ ప్రభాత్​ ప్రాంతంలో ఈ  ఘటన జరిగింది. ఈ దుర్ఘటన ఉదయం జరగ్గా పోలీసులకు మధ్యాహ్నం ఒకటిన్నరకు సమాచారం అందింది.  ట్రక్కను క్రేన్​ సహాయంతో పైకి తీశారు. ట్రక్కు మీద పడగానే నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.