తుక్కాపురంలో హత్య 

తుక్కాపురంలో హత్య 

ముద్ర ప్రతినిధి భువనగిరి:మండలంలోని తుక్కాపురం  గ్రామంలో గురువారం దారుణ హత్య జరిగిన సంఘటన చోటచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దశాని రాజమల్లు కు గుంటి బసవయ్య ( 65 ) ల మధ్య గత 3 రోజుల క్రితం చిన్న వివాదం చోటు చేసుకుంది. కాగా గురువారం ఉదయం  ఇంటి వద్ద కంకర తీస్తుండగా రాజమల్లు పారతో దాడి చేయగా  బసవయ్య అక్కడి కక్కడే మృతి చెందాడు.

అడ్డు వచ్చిన భార్య తిరుపతమ్మ పై దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత నిమిత్తం ఏరియా ఆసుపత్రి కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.