విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి

విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి
Lineman dies of electric shock

గుండాల ఫిబ్రవరి 13 (ముద్ర న్యూస్): గుండాల మండలం మాసన్ పల్లి గ్రామానికి చెందిన మండే గుజ్జుల సోమయ్య విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ సోమవారం విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. గుండాల మండలం నుండి బదిలీపై వెళ్లి ఆలేరు మండలంలో, పనిచేస్తు  ఆలేరు మండలం గోల్డెన్ కొండ గ్రామంలో విద్యుత్ శాఖ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. ఉదయం గోలన్ కొండ గ్రామంలో  ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయింది అని రైతులు సమాచారం ఇవ్వగా ఫీజు సరి చేయడానికి వెళ్ళ విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికి అక్కడే ప్రాణాలు వదిలాడు.

అక్కడే ఉన్న రైతులు సంబంధిత అధికారులకు సమాచారంఅందించారు. అతనికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అతను చిన్నప్పటి నుండి కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాడని  స్థానిక గ్రామ సర్పంచు ఏలూరి  రామిరెడ్డి తెలిపారు.ప్రభుత్వం అన్ని రకాల ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.