కారు -బస్సు ఢీ ఇద్దరు స్పాట్ డెడ్

కారు -బస్సు ఢీ ఇద్దరు స్పాట్ డెడ్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులోని జైన్ మందిర్ వద్ద కారు - బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. పాపన్న పేట మండలం ఎల్లాపూర్ కు చెందిన వారు హైదరాబాద్ వైపు నుంచి ఆల్టో కారులో గ్రామానికి వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. ఒక పాప పరిస్థితి సీరియస్ గా ఉంది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.