యువకుడి దారుణ హత్య..

యువకుడి దారుణ హత్య..
  • అక్రమ సంబంధం కారణమనే అనుమానం..

ముద్ర,చందుర్తి:యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మాల్యాల గ్రామంలో చోటు చేసుకుంది..హత్యకు సంబంధించిన వివరాలను చందుర్తి సీఐ కిరణ్ కుమార్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్యాలకు చెందిన పడిగల నరేష్ తన ఇంటి సమీపంలో ఉన్న వివాహితతో గత కొన్నాళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై గతంలోనూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఐదేళ్ల క్రితం హతుడు నరేష్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు..కాగా, పది రోజుల క్రితం గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చిన నరేశ్ మళ్లీ యథావిధిగా సదరు వివాహేతతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. అయితే వివాహిత భర్త సైతం గల్ఫ్‌లో ఉండటంతో ఈ విషయాన్ని తన అన్న కొడుకు లక్ష్మణ్ ద్వారా తెలుసుకుని ఆగస్టు 29న దుబాయ్ నుంచి మల్యాల గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి అదును కోసం ఎదురు చూసి పథకం ప్రకారం బుధవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో హత్య చేశాడని సీఐ కిరణ్ కుమార్ చెప్పారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు.