శనగల యంత్రంలో పడి వ్యక్తి మృతి

శనగల యంత్రంలో పడి వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో శనగల యంత్రంలో ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన మనీష్ (22) అనే వ్యక్తి శనగలు పట్టేందుకు మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నాడు. కాగా ప్రతిరోజు లాగే శుక్రవారం కూడా శనగలు పడుతుండగా అందులో ఇరుక్కొని ఆయన మృతి చెందాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.