అర కిలో గంజాయి, బైక్ సీజ్... ముగ్గురు అరెస్ట్

అర కిలో గంజాయి, బైక్ సీజ్... ముగ్గురు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో  గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇటీవల గంజాయి కేసులు అధికమవుతున్నాయి. శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో  రుస్తుంపేట్ వద్ద అర కిలో గంజాయి సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ సీఐ రాంరెడ్డి తెలిపారు. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన సాయికుమార్, పురుషోత్తం, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పల్సర్ బైక్ సీజ్ చేశారు. నిండితులను నర్సాపూర్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని సిఐ బి. ఆర్. రాంరెడ్డి వివరించారు. దాడిలో సిబ్బంది ఎల్లయ్య, చంద్రయ్య, రవి, నవీన్, నరేష్, హరీష్ ఉన్నారు.