తెలంగాణ లో బీఎస్సీ పార్టీ ని గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్

తెలంగాణ లో బీఎస్సీ పార్టీ ని గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్

పెద్దపల్లిలో బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి

ముద్ర ప్రతినిధి,పెద్ద‌ప‌ల్లి: తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్ ను చేస్తామని బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఎస్పీ పార్టీ బహిరంగ సభలో మయవతి మాట్లాడుతూ పెద్ద పెల్లి ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో దాసరి ఉషను అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఆమె కోరారు. దాసరి ఉష పెద్దపల్లిలో నిరంతరం పేద ప్రజల కోసం కష్టపడుతుందని ఆమె గెలిస్తే మీ కష్టాలు తీరుతాయని మాయావతి అన్నారు.

తెలంగాణ లో అన్ని సామాజిక వర్గాల కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని.. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ విమ‌ర్శించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ ని ఈ ఎన్నిక‌ల‌లో తెలంగాణ ప్రజలు చిత్తూ చిత్తుగా ఓడించాల‌ని ఆమె పిలుపు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ లో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి తెలంగాణ ప్రజలు తీసుకు రావాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని పార్టీని గెలిపించాలని మయవతి పెద్దపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.