రేపు రామగుండం లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన 

రేపు రామగుండం లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన 

నెహ్రూ స్టేడియంలో  ఏర్పాట్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రేపు శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రామగుండం లో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. దీంతో రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలోని సింగరేణి జోవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం స్టేడియాన్ని పరిశీలించారు.  స్టేడియంలో నిర్వహించనున్న సభను ఏర్పాట్లను ఆయన పలువురుతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని నియోజకవర్గంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు, మహిళా సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి పర్యటనలు విజయవంతం చేయాలని మక్కాన్ సింగ్ కోరారు.  ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.