సెంపాల్ స్కూల్ అన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

సెంపాల్ స్కూల్ అన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ముద్ర ప్రదినిధి పెద్దపల్లి: గోదావరిఖనిలోని గాంధీ నగర్ లో  సెయింట్ పాల్ స్కూల్లో అన్యువల్ డే ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సంస్కృతి ప్రదర్శనలతో అదరగొట్టారు. విద్య  సంస్కృతి కార్యక్రమంలో విద్యార్థులలో బహుమతులు ప్రధానం చేశారు.

విద్యార్థులను స్పోర్ట్స్ లో పాల్గొని విద్యతోపాటు ఉన్నంత స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించాలని వాళ్ళ తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులను కోరారు. అదేవిధంగా విద్యలో స్పోర్ట్స్ లో ఇలాంటి సాయం కావాలన్నా మీకు అందుబాటులో నేను ఉంటానని, మీ భవిష్యత్తు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు నా వంతు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపాల్ వాణి, ఉపాధ్యాయులు, కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.