సుగుణాకర్‌‌రాజుకు అభినందనలు

సుగుణాకర్‌‌రాజుకు అభినందనలు

ముద్ర ప్రతినిధి, జనగామ : లక్ష్య, ముస్కాన్ పథకాలలో తెలంగాణ రాష్ట్రంలో జనగామ ఎంసీహెచ్ కు మొదటి స్థానం దక్కడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య శనివారం అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఆస్పత్రికి మంచి పేరు తెస్తున్న సిబ్బంది పని తీరును కూడా వారు మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.