పుణ్యస్నానాలకు వచ్చి అనంత లోకాలకు...

పుణ్యస్నానాలకు వచ్చి అనంత లోకాలకు...

ధర్మపురి గోదావరి నదిలో మునిగి బాలుడు మృతి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ధర్మపురి గోదావరి పుణ్య స్నానాలకు వచ్చిన ఓ బాలుడు అనంత లోకాలకు వెళ్ళాడు. నిజాంబాద్ జిల్లా బోధనకు చెందిన కార్తీక్ అనే బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి పుణ్యక్షేత్ర సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

బాలుడు గోదావరి విషయం తెలియక సత్యవతి గుండంలో మునిగి మృతి చెందాడు. స్థానికులు బాలుని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో బాలుడు కుటుంబంలో విషాదఛయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.